Home > తెలంగాణ > Sajjanar : గణేశ్ నిమజ్జనం స్పెషల్.. భక్తుల కోసం 535 బస్సులు

Sajjanar : గణేశ్ నిమజ్జనం స్పెషల్.. భక్తుల కోసం 535 బస్సులు

Sajjanar : గణేశ్ నిమజ్జనం స్పెషల్.. భక్తుల కోసం 535 బస్సులు
X

రెండు తెలుగు రాష్ట్రాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేస్తోంది. గణేశ్ నిమజ్జనానికి భాగ్యనగరం ముస్తాబవుతోంది. మరో రెండు రోజుల్లో గణపయ్యల (Sajjanar) నిమజ్జన మహోత్సవం జరుగనుంది. అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలం నడుమ భారీ గణనాథులు శోభాయాత్రకు అధికారులు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రధాన కూడల్లల్లో ట్రాఫిక్ ఆంక్షను పెట్టారు. తాజాగా నిమజ్జనం వేళ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. గణేశ్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్‌లో ఈనెల 28న భక్తుల కోసం ప్రత్యేకంగా 535 స్పెసల్ బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపనుంది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్‎లో ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను స్పెషల్‎గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.





Updated : 26 Sep 2023 3:47 PM GMT
Tags:    
Next Story
Share it
Top