Home > తెలంగాణ > రెరా సెక్రటరీ అవినీతి... ఐఏఎస్ను విచారించేందుకు సిద్ధమైన ఏసీబీ

రెరా సెక్రటరీ అవినీతి... ఐఏఎస్ను విచారించేందుకు సిద్ధమైన ఏసీబీ

రెరా సెక్రటరీ అవినీతి... ఐఏఎస్ను విచారించేందుకు సిద్ధమైన ఏసీబీ
X

రెరా సెక్రెటరీ శివ బాలకృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ఆస్తులు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ఆయన కాసుల కక్కుర్తి చూసి అధికారులే షాక్ అవుతున్నారు. సుమారు రూ.250 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. శివ బాలకృష్ణకు 214 ఎకరాల భూమి, 29 ప్లాట్లు, వివిధ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలోని 7ఫ్లాట్లు, ఒక విల్లా ఉన్నట్లు విచారణలో తేలింది. మరోవైపు ఏసీబీ విచారణలో ఆయన పలువురి పేర్లు బయటపెట్టినట్లు తెలుస్తోంది. శివ బాలకృష్ణతో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్న సంబంధాలపై ఆరా తీసేందుకు ఏసీబీ సిద్ధమైంది.

ఇప్పటికే దీనిపై నివేదిక రెడీ చేసిన ఏసీబీ.. అరవింద్ కుమార్ను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది. శివ బాలకృష్ణ దగ్గర ఐఏఎస్ అరవింద్ కుమార్ భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే అరవింద్ కుమార్ను విచారించనుంది. ఇక బాలకృష్ణ బినామీలపై కూడా ఏసీబీ ఫోకస్ చేసింది. అతడి సోదరుడు నవీన్ కుమార్పై భారీగా ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. జనగామ, గజ్వేల్, యాదాద్రి ప్రాంతాల్లో నవీన్, అరుణ దంపతులపై భూముల ఉన్నట్లు అధికారులు తెలిపారు.

హెచ్ఎండీఏ డైరెక్టర్గా శివబాలకృష్ణ1 మూడేళ్లు పనిచేశారు. ఈ సమయంలో 120కి పైగా అనుమతులు జారీ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. శంషాబాద్, ఘట్ కేసర్, శంకర్ పల్లి జోన్లో 120కి పైగా అనుమతులు జారీ చేసినట్లు తేల్చారు. ఈ క్రమంలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ డాక్యమెంట్లను అధికారులు పరిశీలించారు. అతడి ఫోన్లు, ల్యాప్టాప్ల నుంచి కీలక విషయాలను సేకరిస్తున్నారు. గత పదేళ్లలో 15 ఫోన్లు మార్చినట్లు గుర్తించారు.

Updated : 11 Feb 2024 8:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top