Home > తెలంగాణ > రాష్ట్ర అధ్యక్షుడితో కీలక భేటీ.. బీజేపీలోకి ప్రముఖ నటి?

రాష్ట్ర అధ్యక్షుడితో కీలక భేటీ.. బీజేపీలోకి ప్రముఖ నటి?

రాష్ట్ర అధ్యక్షుడితో కీలక భేటీ.. బీజేపీలోకి ప్రముఖ నటి?
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. కీలక నేతలతో రహస్య భేటీలు జరిపి.. వారిని పార్టీలోకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ప్రముఖ సినీ నటి జయసుధ కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో జయసుధ బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. కాగా, జయసుధకు రాజకీయ అనుభవం ఉంది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.

ఇదివరకు కూడా జయసుధ బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏమైందో కానీ అంతా సైలెంట్ అయిపోయారు. అంతేకాకుండా సినీ నిర్మాతతో కలిసి బీజేపీ చేరికల కమిటీ సభ్యులు మంతనాలు జరిపినట్లు పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటికే కిషన్ రెడ్డి, డీకే అరుణ ఢిల్లీకి బయలుదేరగా, మధ్యాహ్నం ఈటల రాజేందర్ వెళ్లనున్నారు.

Updated : 29 July 2023 6:37 AM GMT
Tags:    
Next Story
Share it
Top