Home > తెలంగాణ > సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
X

సొంత పార్టీ నేతలపై అదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ బిడ్డనైన తన ఎదుగుదల చూడలేక ఎంపీ ల్యాడ్స్ నిధులను సొంతానికి వాడుకునన్నానంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కావాలనే తనను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.తన మాటలను వక్రీకరించారని.. వీడియోను ఎడిట్‌ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని వాపోయారు.

పాయల్‌ శంకర్‌, రాఠోడ్‌ రమేశ్‌లు తోడుదొంగలని సోయం విమర్శించారు. ఎంపీ ల్యాడ్స్‌ పనులకు కలెక్టర్‌ అనుమతులు ఉంటాయని, ఇష్టారాజ్యంగా వాడుకోవడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. సొంతానికి వాడుకున్నట్లుగా నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. గతంలోనూ తాను కాంగ్రెస్‌, బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు ప్రచారం చేశారని ఆరోపించారు. వీరి ఆగడాలు భరించలేకే ఎన్‌ఆర్‌ఐ కంది శ్రీనివాసరెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారని చెప్పారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

ఎంపీ నిధులతో ఇల్లు కట్టుకున్నా

కాగా అంతకుముందు ఎంపీ ల్యాడ్స్ నిధులపై సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘‘ఒక ఎంపీగా నాకంటూ సొంత ఇల్లు లేకపోతే గౌరవం ఉండదనే ఉద్దేశంతోనే.. ఎంపీ నిధులతో ఇల్లు కట్టుకున్నా. అవే పైసలతో కొడుకు పెళ్లి కూడా చేశా. రెండు, మూడు రోజుల క్రితం రూ.5 కోట్ల నిధులు వస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఆ నిధులతో అభివృద్ధి పనులు చేస్తా అంటూ ఎంపీ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Updated : 20 Jun 2023 2:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top