Home > తెలంగాణ > BRS మాజీ ఎమ్మెల్యేకు మరో షాక్.. ఇంటికి నోటీసులు అంటించారు

BRS మాజీ ఎమ్మెల్యేకు మరో షాక్.. ఇంటికి నోటీసులు అంటించారు

BRS మాజీ ఎమ్మెల్యేకు మరో షాక్..  ఇంటికి నోటీసులు అంటించారు
X

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి మరో షాక్ తగిలింది. బకాయిలు చెల్లించాలంటూ ఇప్పటికే TSRTC నుంచి నోటీసులు అందుకున్న జీవన్ రెడ్డికి.. బకాయి పడ్డ తమ నిధుల్ని కూడా వడ్డీతో సహా చెల్లించాలంటూ మరో సంస్థ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (AP SFC) నోటీసులు జారీ చేసింది. అధికారులు ఈ నోటీసుల్ని ఆయన ఇంటికి అంటించడం ఆర్మూర్ లో చర్చనీయాంశంగా మారింది. 2017లో తీసుకున్న రూ.20 కోట్ల రుణం చెల్లించాలని నోటీసుల్లో ఏపీ ఎస్‌ఎఫ్‌సీ పేర్కొంది.

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లోని జీవన్ రెడ్డికి చెందిన విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రై.లి. సంస్థ.. ఆరున్నరేళ్ల కిందట తీసుకున్న రూ.20 కోట్ల రుణానికి వడ్డీ రూ.25 కోట్లు, ఇతర ఖర్చులు కలిపి రూ.45,46,90,000 చెల్లించాలని AP SFC నోటీసుల్లో పేర్కొంది. నోటీసులు జారీ అయిన తేదీ నుంచి 60 రోజుల్లోగా బకాయిలు చెల్లించకుంటే.. రికవరీ చట్టాలకు లోబడి నడుచుకుంటామని హెచ్చరించింది. విష్ణుజిత్‌ సంస్థ ఆర్మూర్‌లోని RTC స్థలాన్ని లీజుకు తీసుకొని జీవన్‌రెడ్డి మాల్‌ పేరిట కాంప్లెక్స్‌ నిర్మించింది. RTC కి లీజు కింద ఇవ్వాల్సిన రూ.7.23 కోట్లు, విద్యుత్తుశాఖకు రూ.2.5 కోట్లు బకాయి పడటంతో ఆయా సంస్థలు ఈ నెల 7న నోటీసులు జారీ చేశాయి. విద్యుత్తుశాఖ కరెంటు సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రుణ బకాయిలపై నోటీసులు జారీ చేసింది.

Updated : 12 Dec 2023 2:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top