Home > తెలంగాణ > MP Kotha Prabhakar Reddy: BRS ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తి ఇతడే

MP Kotha Prabhakar Reddy: BRS ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తి ఇతడే

MP Kotha Prabhakar Reddy: BRS ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తి ఇతడే
X

బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎన్నికల ప్రచారంలో దుండగుడు కత్తితో దాడి చేశాడు. ప్రభాకర్‌రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని బీఆర్ఎస్ కార్యకర్తలు చితక్కొట్టారు. దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రస్తుతం ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. ఇందులో భాగంగా కొత్త ప్రభాకర్ రెడ్డి దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా సూరంపల్లిలో పాస్టర్‌ కుటుంబాన్ని ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు. పరామర్శించిన తర్వాత వారి ఇంటి నుంచి బయటకు వస్తున్నఆయన్ను.. ఓ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇచ్చినట్లుగా చేయి చాపుతూ వచ్చి అకస్మాత్తుగా .. కడుపులో కత్తితో పొడిచాడు. వెంటనే ఆ దుండగుణ్ని పక్కనున్న బీఆర్ఎస్ కార్యకర్తలు సదరు వ్యక్తిని పారిపోకుండా పట్టుకున్నారు. వెంటనే ప్రభాకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడ్ని మిరుదొడ్డి మండలం చెప్పాల గ్రామానికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. అతడు ఓ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అని, కాంగ్రెస్ సానుభూతి పరుడని తెలిసింది. కాంగ్రెస్ నేతలతో సదరు నిందితుడు దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగిందన్న సమాచారం తెలిసిన వెంటనే మంత్రి హరీష్‌ రావు హుటాహుటిన ఫోన్‌లో మాట్లాడారు. అవసరం అయితే హైదరాబాద్ కు తీసుకురావాలని బీఆర్‌ఎస్‌ నేతలకు హరీష్‌ రావు సూచించారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారిని మెరుగైన వైద్యం కోసం గజ్వేల్ ఆసుపత్రి నుండి అంబులెన్స్ లో సికింద్రాబాద్ యశోద కు తరలించారు.

Updated : 30 Oct 2023 10:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top