Home > తెలంగాణ > ముస్లిం ధోబీలకు ఫ్రీ కరెంటుతో రజకులకు దెబ్బ.. బండి ఫైర్

ముస్లిం ధోబీలకు ఫ్రీ కరెంటుతో రజకులకు దెబ్బ.. బండి ఫైర్

ముస్లిం ధోబీలకు ఫ్రీ కరెంటుతో రజకులకు దెబ్బ.. బండి ఫైర్
X

ముస్లింలు నిర్వహించే ధోబీ ఘాట్లకు, ల్యాండ్రీలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. బట్టలు ఉతికే వృత్తిపై ఆధారపడి బతుకుతున్న రజకులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల దగ్గర పడడంతో ఒక మతం ఓట్ల కోసం కేసీఆర్ హిందువుల కులవృత్తులను నాశనం చేస్తున్నారని, ఇది మత దురహంకారమని మండిపడ్డారు.

‘‘బీసీల కుల వృత్తులను ఆర్థికంగా దెబ్బతీసి ఎంఐఎంను సంతృప్తి పరచాలన్నదే కేసీఆర్ లక్ష్యం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మైనార్టీ వర్గం ఓట్ల కోసం కేసీఆర్ బిసి కులవృత్తులపై దాడి చేస్తున్నారు... తరతరాలుగా దోభి వృత్తిపై ఆధారపడ్డ రజకులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారు. ఇక గల్లీ గల్లీలో వేరే వర్గం వారి ల్యాండ్రీ షాపులు వెలుస్తాయి. నయా నిజాం కేసీఆర్‌కు మతపిచ్చి ఎక్కువై, ఓవైసీని సంతోష పెట్టడానికి రజకుల వృత్తిని నాశనం చేయడానికి పూనుకున్నాడు. ఇప్పటికే వేరే వాళ్లు దూరడంతో తమ కులవృత్తుల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బీసీ వర్గాలు తీవ్ర మనోవేదనలో ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మూలిగే నక్కపై తాటి పండు వేసినట్టుగా ఉంద’’ అని విమర్శించారు. కులవృత్తులపై ఆధారపడ్డ బీసీలు, ఎస్సీలు కేసీఆర్ చేస్తున్న ద్రోహన్ని గమనిస్తున్నారని అన్నారు. రజకులకు తమ పార్టీ అండగా నెలబడతుందని, కేసీఆర్ మతదురహంకారంపై పోరాడి కుల వృత్తులను కాపాడుకోవాల్సిని అవసరం ఉందని అన్నారు.

Updated : 20 Sep 2023 1:40 PM GMT
Tags:    
Next Story
Share it
Top