Home > తెలంగాణ > కాళేశ్వరం స్కాం వెనకాల ఆ కంపెనీ : రఘునందన్ రావు

కాళేశ్వరం స్కాం వెనకాల ఆ కంపెనీ : రఘునందన్ రావు

కాళేశ్వరం స్కాం వెనకాల ఆ కంపెనీ  : రఘునందన్ రావు
X

దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిందని బీజేపీ నేత రఘునందన్ రావు ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ నివేదిక అడిగిందని.. కానీ తమ బండారం బయట పడుతుందని అప్పటి కేసీఆర్ సర్కార్ భయపడిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి గతంలో సీబీఐ విచారణ చేయాలని అమిత్ షాకు లేఖ రాశారని.. ఇప్పుడెందుకు అలా చేయడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు పట్ల తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు.

కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదని.. అది ప్రాజెక్టులో ఒక చిన్న భాగం మాత్రమేనని రఘునందన్ అన్నారు. కాళేశ్వరం సొమ్మును రికవరీ చేసి ప్రజల ఖాతాలో వేస్తామని రాహుల్ గాంధీ చెప్పిన మాట ఏమైందని అడిగారు. ఈ స్కాం వెనకాల మేఘా కంపెనీ ఉందని.. కానీ ఎల్ ఆండ్ టీ వరకే కాళేశ్వరం స్కాంను పరిమితం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మేఘా కంపెనీకి కర్ణాటకలో కొన్ని ప్రాజెక్ట్స్ దక్కాయని.. అందుకే కాంగ్రెస్ సర్కార్ ఆ కంపెనీని కాపాడే ప్రయత్నం చేస్తోందని అనుమానించారు. హైకోర్టు జడ్జి విచారణ అనేది కేసును పక్క దారి పట్టించడానికి మాత్రమేనని చెప్పారు. రేవంత్ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

Updated : 19 Dec 2023 8:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top