Home > తెలంగాణ > ఎమ్మెల్యేలను కొని అధికారంలోకి రావాలని కుట్ర చేస్తుండు : బండి సంజయ్

ఎమ్మెల్యేలను కొని అధికారంలోకి రావాలని కుట్ర చేస్తుండు : బండి సంజయ్

ఎమ్మెల్యేలను కొని అధికారంలోకి రావాలని కుట్ర చేస్తుండు : బండి సంజయ్
X

పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని.. ఆయన కుట్రతో రేవంత్ సర్కార్ కూలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. కుట్రలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ అన్న సంజయ్.. ప్రజాస్వామ్యంపై ఆయనకు నమ్మకం లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ కదలికలపై కాంగ్రెస్ హైకమాండ్ ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. ప్రభుత్వాలను కూల్చే సంస్కృతి తమకు లేదని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ కాపాడుకోవాలని చెప్పారు.

కాంగ్రెస్పై పోరాటం తర్వాత.. ముందు రాష్ట్రంలో బీఆర్ఎస్ లేకుండా చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. యాదాద్రిని కేసీఆర్ వ్యాపార కేంద్రంగా మార్చారని సంజయ్ మండిపడ్డారు. యాద్రాద్రి చుట్టు భూములు కొనుగోలు చేయడంతో పాటు ఆలయంలో తన బొమ్మను చెక్కించుకున్నారని విమర్శించారు. కానీ అయోధ్యలో ప్రధాని మోదీ బొమ్మ, భూములు కొనుక్కోలేదని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ హామీలు అమలు కావాలన్నా.. బీజేపీ ఎంపీలు గెలిస్తే రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయన్నారు. గల్లీలో ఎవరు పాలించినా.. ఢిల్లీలో మోదీయే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

Updated : 14 Jan 2024 7:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top