Home > తెలంగాణ > 4 ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు

4 ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు

4 ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు
X

రానున్న లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధం అవుతోంది. ఈ మేరకు నలుగురు ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత పేర్లను పార్టీ ఖరారు చేసింది. కాగా గత రెండు రోజులుగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో కేసీఆర్ చర్చించారు. అందరి నిర్ణయం ప్రకారం ఏకగ్రీవంగా ఎంపికైన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదని విమర్శించారు. కరీంనగర్ సభ తర్వాత ఖమ్మంలో కూడా సభ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీదని తేల్చి చెప్పారు. దీనికోసం నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురితో సమన్వయ కమిటీ ఉండాలని సూచించారు.

Updated : 4 March 2024 2:06 PM GMT
Tags:    
author-thhumb

Krishna

సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.


Next Story
Share it
Top