Home > తెలంగాణ > B.vinod kumar:రేవంత్ రెడ్డిపై ఆంధ్రా మేధావుల ప్రభావం.. కుట్ర జరుగుతోంది'

B.vinod kumar:రేవంత్ రెడ్డిపై ఆంధ్రా మేధావుల ప్రభావం.. కుట్ర జరుగుతోంది'

B.vinod kumar:రేవంత్ రెడ్డిపై ఆంధ్రా మేధావుల ప్రభావం.. కుట్ర జరుగుతోంది
X

తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని రేవంత్ సర్కార్ చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్. రాష్ట్ర చిహ్నం కాకతీయ తోరణం, చార్మినార్ వంటి చారిత్రక గుర్తులు ఉన్నాయని తెలిపారు. సామాన్య ప్రజల కోసం కాకతీయులు పరితపించారని గుర్తుచేశారు. చార్మినార్ అంటే హైదరాబాద్ గుర్తు అని తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గుర్తులను చెరిపివేసేలా ఎవరో సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. మంత్రలందరూ రాష్ట్ర చిహ్నం విషయంలో ఆలోచించాలి

ఆదివారం మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్.. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ చరిత్రను మరిపించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర చిహ్నంలోని కాకతీయ తోరణానికి ఘనమైన చరిత్ర ఉందని, కాకతీయులు దక్షిణ భారతదేశాన్ని అంతా పాలించారన్నారు. గోలుసు కట్టచెరువులు కట్టించిన కాకతీయులు తెలంగాణ లో వ్యవసాయంపై శ్రద్దచూపారన్నారు. 44 వేల చెరువులు కుంటలు నిర్మించారని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో చెరువులను అశ్రద్ద చేస్తే కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం తెచ్చి బాగుచేశారని చెప్పారు. రేవంత్ రెడ్డిపై ఆంధ్రా మేధావుల ప్రభావం ఉందని అన్నారు. రాష్ట్ర చిహ్నంలో ఎలాంటి మార్పులు చేయొద్దని తాము కోరుతున్నామని తెలిపారు. కేసీఆర్ పాలనలో ఏలాంటి కుట్రలతావులేకుండా చేసారు.

కాగా, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని నిర్ణయించింది. అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని తీర్మానించింది. వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఇకపై టీఎస్‌ నుంచి టీజీగా మార్చేందుకు చట్టం చేయనున్నది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక పోకడలు ఉన్నాయని అందుకే వాటిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రులు చెప్పారు.




Updated : 11 Feb 2024 1:04 PM GMT
Tags:    
Next Story
Share it
Top