Home > తెలంగాణ > Revanth Reddy : బీఆర్ఎస్కు షాక్.. సీఎంతో భద్రాచలం ఎమ్మెల్యే భేటీ

Revanth Reddy : బీఆర్ఎస్కు షాక్.. సీఎంతో భద్రాచలం ఎమ్మెల్యే భేటీ

Revanth Reddy : బీఆర్ఎస్కు షాక్.. సీఎంతో భద్రాచలం ఎమ్మెల్యే భేటీ
X

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. దీంతో ఆయన త్వరలోనే పార్టీ మారుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రిని కలిశారు. నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ నిధులను విడుదల చేయమని రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని కూడా అందించినట్లు తెలుస్తోంది. అయితే ఇది మర్యాద పూర్వక భేటీనే అని తెల్లం వెంకట్రావు అన్నారు.





కాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరతారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గానూ..అందులో 9 సీట్లను కాంగ్రెస్ గెలిచింది. భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ గెలిచింది. అయితే ఆయన ముందునుంచి పొంగులేటికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. కాంగ్రెస్ లో టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా ఆయన గెలిచిన పది నిమిషాలకే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. కానీ పార్టీ మారుతారు అన్న వార్తలను తెల్లం వెంకట్రావు కొట్టిపారేశారు.




Updated : 3 March 2024 7:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top