Home > తెలంగాణ > MLC Kavitha : సంచలన నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ కవిత..జాగృతి కమిటీలు రద్దు

MLC Kavitha : సంచలన నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ కవిత..జాగృతి కమిటీలు రద్దు

MLC Kavitha  : సంచలన నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ కవిత..జాగృతి కమిటీలు రద్దు
X

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత జాగృతి అన్ని కమీటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోగా పలువురు నాయకులు పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కమీటీల్లో ఉన్న నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తే ఆ ఎఫెక్ట్ కవితతో పాటు బీఆర్‌ఎస్ పార్టీపై అవకాశం ఉన్నందున ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. భారత జాగృతి సంస్థకు చెందిన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు నేడు ప్రకటించారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్టు కవిత కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. కమిటీల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే భారత జాగృతి నేతలు సైతం కాంగ్రెస్, ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు సిద్ధమైనట్లు సమాచారం రావడంతో కవిత ముందే అప్రమత్తమై కమిటీల అన్ని రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత కమిటీల్లో ఉన్న నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తే.. ఆ ఎఫెక్ట్ తనతో పాటు బీఆర్ఎస్ పార్టీపై పడుతోందని అలర్ట్ అయ్యే కవిత కమిటీలన్నీ రద్దు చేసి.. విధేయులతో త్వరలోనే కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, కవిత సడెన్‌గా భారత జాగృతి కమిటీలు అన్ని రద్దు చేయడానికి గల అసలు కారణాలు ఏంటన్నది మాత్రం తెలియాల్సి ఉంది.




Updated : 10 March 2024 1:32 PM GMT
Tags:    
Next Story
Share it
Top