ఈ నెల 15న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
Kiran | 11 Sep 2023 5:21 PM GMT
X
X
సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఎంపీలకు దిశా నిర్దేశం చేసేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 15న కేసీఆర్ బీఆర్ఎస్ ఎంపీలతో ప్రగతి భవన్లో భేటీ కానున్నారు.
ఈనెల 18నుంచి 22వరకు 5 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్లో జమిలి ఎన్నికల బిల్లు, ఇండియా పేరు మార్పుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాపై చర్చించేందుకు కేసీఆర్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ రాజ్యసభ, లోక్ సభ సభ్యులందరూ తప్పకుండా హాజరుకావాలని పార్టీ అధినేత ఆదేశించారు.
Updated : 11 Sep 2023 5:21 PM GMT
Tags: telangana brs cm kcr september 15 parliament special session pragathi bhawan brs mp one nation one election india bharat name change loksabha rajya sabha brs mps meeting kcr meeting with mps
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire