Home > తెలంగాణ > KCR : రేపు తెలంగాణ భవన్ కు కేసీఆర్.. ఆ జిల్లా నేతలతో భేటీ

KCR : రేపు తెలంగాణ భవన్ కు కేసీఆర్.. ఆ జిల్లా నేతలతో భేటీ

KCR : రేపు తెలంగాణ భవన్ కు కేసీఆర్.. ఆ జిల్లా నేతలతో భేటీ
X

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం తెలంగాణ భవన్‌కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన తెలంగాణ భవన్కు రానుండటం ఇదే తొలిసారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని జిల్లాల నేతలతో రేపు ఉదయం 11 గంటలకు బీఆర్‌ఎస్ అధినేత సమావేశంకానున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారు. ఫిబ్రవరి 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేబినెట్ నిర్ణయాలు, సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు సూచనలు ఇవ్వనున్నారు.

మరోవైపు అసెంబ్లీ సమావేశాల అనంతరం నల్గొండ జిల్లాలో భారీగా బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ హాజరుకానున్న ఈ సభను లోక్ సభ ఎన్నికల ప్రచార శంఖారావంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గులాబీ నేతలు చర్చించనున్నారు.




Updated : 5 Feb 2024 2:46 PM GMT
Tags:    
Next Story
Share it
Top