Home > తెలంగాణ > కోదండరామ్‌కు పదవి ఇస్తే సహించలేకపోతున్నారు..సీతక్క కామెంట్స్

కోదండరామ్‌కు పదవి ఇస్తే సహించలేకపోతున్నారు..సీతక్క కామెంట్స్

కోదండరామ్‌కు పదవి ఇస్తే సహించలేకపోతున్నారు..సీతక్క కామెంట్స్
X

తెలంగాణ కోసం పోరాడిన తెలంగాణ జన సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే బీఆర్‌ఎస్ నేతలు సహించలేకపోతున్నారని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర ప్రజలకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమి లేదని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కనీసం మంచినీరు కూడా అందించలేదని విమర్మించారు. ఇంద్రవెల్లిలో నిర్వహించే సభకు ప్రజలు భారీగా తరలిరావాలని సీతక్క పిలుపునిచ్చారు. ఆదివాసీ బిడ్డనైన తనకు ఉమ్మడి జిల్లా అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి అన్నారు. సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. రేపు ఇంద్రవెల్లిలో నిర్వహించే ముఖ్యమంత్రి బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. తాను ఆదివాసీ బిడ్డనని.. ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ జిల్లాకు తనను ఇంఛార్జ్ మంత్రిగా వేయడం తన అదృష్టమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి తన లక్ష్యమన్నారు.

ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను అండగా ఉంటాం..

రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు ఇస్తామని, ఇప్పటికే ఉన్న వాటికి మరమ్మతులు చేస్తామని వెల్లడించారు. ఇంద్రవెల్లి అమరవీరుల వివరాలు, 1981 ఏప్రిల్ 20న జరిగిన పోలీసు కాల్పుల్లో గాయపడిన వారి వివరాలు, వారి కుటుంబ వివరాలను సేకరిస్తామని తెలిపారు. ఆదివాసీలు, వారి దేవుళ్ల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో గౌరవముందని.. ఆదివాసీల దేవుళ్ళ ఆశీస్సులతో తాను సీఎంను అయ్యానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా నమ్ముతారన్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను, 1981లో అక్కడ పోలీసుల కాల్పుల్లో గాయపడినవారిని ఆదుకుంటామని సీతక్క అన్నారు. బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు, ఆర్థిక సహాయం అందించడం సహా అన్ని రకాల సహకారాలు అందిస్తామని ఆమె అన్నారు. బాధిత కుటుంబాల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశ పెడతామన్నారు. అంతర్గత ప్రాంతాలకు కొత్త రోడ్లు వేయడం, సాగునీటి ప్రాజెక్టులపై సీఎం దృష్టి సారిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు.

Updated : 1 Feb 2024 11:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top