Home > తెలంగాణ > మంత్రి కేటీఆర్కు ఈసీ నోటీసులు.. రూల్స్ బ్రేక్ చేశారంటూ..

మంత్రి కేటీఆర్కు ఈసీ నోటీసులు.. రూల్స్ బ్రేక్ చేశారంటూ..

మంత్రి కేటీఆర్కు ఈసీ నోటీసులు.. రూల్స్ బ్రేక్ చేశారంటూ..
X

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌ ఎంపీ రణదీప్‌ సూర్జేవాలా ఫిర్యాదుతో ఈసీ నోటీసులు ఇచ్చింది. టీ వర్క్స్‌లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్‌లో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. రాజకీయ కార్యకలాపాలకు కేటీఆర్ టీ వర్క్స్ను వాడుకున్నారని సుర్జేవాలా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్కు ఈసీ నోటీసులు ఇచ్చింది.

‘‘ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతోపాటు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని టీ వర్క్స్‌ భేటీలో విద్యార్థులకు కేటీఆర్‌ హామీ ఇచ్చారు. రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ ఆఫీసు టీ వర్క్స్‌ను వాడుకున్నారు’’ అని సూర్జేవాలా ఈసీకీ చేసిన ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ.. మంత్రి కేటీఆర్‌ ప్రాథమిక ఎన్నికల నియామవాళిని ఉల్లంఘించినట్టు అభిప్రాయపడింది. ఆదివారం మధ్యాహ్నం 3గంటల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని మంత్రికి నోటీసులు జారీ చేసింది.

Updated : 25 Nov 2023 4:41 PM GMT
Tags:    
Next Story
Share it
Top