Home > తెలంగాణ > తెలంగాణలో 20, ఏపీకి 9 మందికి కేంద్ర పతకాలు

తెలంగాణలో 20, ఏపీకి 9 మందికి కేంద్ర పతకాలు

తెలంగాణలో  20, ఏపీకి 9 మందికి కేంద్ర పతకాలు
X

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ పోలీసు పతకాలు ప్రకటించింది. వీటిలో ఏపీ నుంచి 9 మందికి పోలీసు విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. తెలంగాణ నుంచి ఆరుగురు గ్యాలంటరీ, ఇద్దరు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు అడిషనల్ డీజీపీలు సౌమ్యామిశ్రా, దేవేంద్ర సింగ్ చౌహాన్,12 మంది విశిష్ఠ సేవా పతకాలు అందుకోనున్నారు. ఈ మేరకు గురువారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 275 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ, 102 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 753 మందికి పోలీస్‌ విశిష్ఠ సేవా (మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌) పతకాలను ప్రకటించింది.

గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్న 277 మందిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్‌ నుంచి 72 మంది పోలీసులు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 26, ఝార్ఖండ్‌ నుంచి 23, మహారాష్ట్ర నుంచి 18 మంది ఉన్నారు. సీఆర్పీఎఫ్‌నుంచి 65, సశస్త్ర సీమాబల్‌ నుంచి 21 మంది ఈ పతకాలు అందుకోనున్నారు. లెఫ్ట్‌ వింగ్‌ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న 119 మంది, జమ్మూకశ్మీర్‌లో పనిచేస్తున్న 133 మందికి ఈ మెడల్స్‌ దక్కాయి.రిపబ్లిక్ డే పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ఏటా రెండు సార్లు ఈ పోలీసు పతకాలను ప్రకటిస్తుంది.

Updated : 25 Jan 2024 6:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top