Home > తెలంగాణ > CM Revanth Reddy : మూసీ నదీ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy : మూసీ నదీ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy : మూసీ నదీ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష
X

మూసీ నదీ పరీవాహక ప్రాంతాల అభివృద్ధికి చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్‌తో పాటు పలు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని ముందుగా మూసీని శుభ్రం చేయాలని సీఎం స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న చెప్పారు. అధికారులకు పని విభజన చేసి మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. సమావేశం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళ్లారు. కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్‌ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై హైకమాండ్‌తో రేవంత్‌ చర్చించనున్నట్లు సమాచారం తెలుస్తోంది​.

Updated : 19 Feb 2024 12:37 PM GMT
Tags:    
Next Story
Share it
Top