Home > తెలంగాణ > చంద్రమోహన్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

చంద్రమోహన్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

చంద్రమోహన్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
X

తెలుగు వెండి తెర తొలితరం కథా నాయకుడు చంద్రమోహన్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం, తెలుగు చిత్ర సీమకు తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. వారి స్పూర్తితో ఎందరో నటీనటులు ఉన్నత స్థాయికి ఎదిగారని.. కళామతల్లి ముద్దుబిడ్డగా తెలుగుతో పాటు పలు భాషల్లో లక్షలాది మంది అభిమానాన్ని చంద్రమోహన్ సొంతం చేసుకున్నారని సీఎం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సినీ నటుడు చంద్రమోహన్‌ మృతి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రమోహన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయడం బాధాకరమని అన్నారు. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని జగన్ గుర్తు చేశారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.



Updated : 11 Nov 2023 7:03 AM GMT
Tags:    
Next Story
Share it
Top