Home > తెలంగాణ > బీసీల తరహాలోనే మైనార్టీలకు లక్ష.. ఉత్తర్వులు జారీ

బీసీల తరహాలోనే మైనార్టీలకు లక్ష.. ఉత్తర్వులు జారీ

బీసీల తరహాలోనే మైనార్టీలకు లక్ష.. ఉత్తర్వులు జారీ
X

మైనార్టీలకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. బీసీలకు ఇచ్చినట్లుగానే మైనార్టీలకూ లక్ష సాయం అందించాలని నిర్ణయించింది. పూర్తి సబ్సిడీతో మైనార్టీలకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.

కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తోందని చెప్పారు. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు.

విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. భిన్న సంస్కృతులను, విభిన్న మత ఆచార సాంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునా తహజీబ్ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే వుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.



Updated : 23 July 2023 10:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top