Home > తెలంగాణ > దేశంలో ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇస్తుంది మా ప్రభుత్వమే - సీఎం కేసీఆర్

దేశంలో ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇస్తుంది మా ప్రభుత్వమే - సీఎం కేసీఆర్

దేశంలో ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇస్తుంది మా ప్రభుత్వమే - సీఎం కేసీఆర్
X

దేశంలో అత్యధిక జీతాలు తీసుకుంటున్నది తెలంగాణ ఉద్యోగులేనని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ జీతాలిస్తామని ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30శాతం పీఆర్సీతో పాటు ఔట్ సోర్సింగ్ వారికి సైతం 30శాతం జీతాలు పెంచామని అన్నారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు కాంగ్రెస్ గానీ మరే ప్రభుత్వం గానీ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగులు సైతం చమటోడ్చి పనిచేస్తున్నారని కేసీఆర్ అన్నారు. ఇంజనీర్ల పుణ్యాన ప్రాజెక్టుల్లో నీళ్లు కనపడుతున్నాయని, ఫారెస్ట్ ఆఫీసర్ల కారణంగా వనాలు, వ్యవసాయాధికారుల కృషితో కోట్ల టన్నుల ధాన్యం పండుతోందని అన్నారు.

దేశం ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పే స్కేల్‌ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. వారి జీతాలు బ్రహ్మాండంగా పెంచుతామని అన్నారు. రాష్ట్ర ధనికమైతే వాళ్లు కూడా ధనికులుకావాలని ఆకాంక్షించారు. అతి తక్కువ సమయంలోనే ఐఆర్‌ ఇచ్చి.. పీఆర్సీ అపాయింట్‌ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. పీఆర్సీ రెకమెండేషన్‌ ఆధారంగా మరోసారి జీతాలు పెంచుతామని అన్నారు.

Updated : 6 Aug 2023 12:49 PM GMT
Tags:    
Next Story
Share it
Top