Home > తెలంగాణ > పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. సీఎం కేసీఆర్ పొలిటికల్ ప్లాన్!!

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. సీఎం కేసీఆర్ పొలిటికల్ ప్లాన్!!

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. సీఎం కేసీఆర్ పొలిటికల్ ప్లాన్!!
X



Thumb: 'బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు పడాలనే.. ఈ హడావుడి'

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గం ద్వారా నాగర్ కర్నూలు వెళ్లనున్న సీఎం.. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు నార్లాపూర్ రిజర్వాయర్ సమీపంలోని కంట్రోల్ రూమ్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం ఒక మోటారును స్విచ్​ఆన్ ​చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.

అయితే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ వేళ ప్రతిపక్షాలు.. ఇదంతా సీఎం కేసీఆర్ ఎన్నికల స్ట్రాటజీ అని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో సిద్ధం కాకున్నా.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారని అంటున్నారు. నిజానికి దాదాపు ఎనిమిదిన్నర సంవత్సరాల(2015లో ) క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సర్వేలు చేపట్టి పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని ప్రారంభించింది. కానీ పలు కారణాలతో ఆ పథకం నత్త నడకన సాగుతోంది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో రిజర్వాయర్లు సిద్ధం కాలేదు.

ఎన్నికల నేపథ్యంలో పాలమూరు-రంగారెడ్డి పథకం ఆయా నియోజకవర్గాల్లోని తమ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపకూడదన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఇలా హఠాత్తుగా ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమయ్యారని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు పడాలనే.. ఈ హడావుడి చేస్తున్నారని అంటున్నారు. ఈ ప్రాజెక్టు కన్నా ఆలస్యంగా చేపట్టిన కాళేశ్వరం పూర్తికాగా పాలమూరు-రంగారెడ్డి పథకం ఇంకా పూర్తి కాలేదని.. ప్రజలను ఏదో నమ్మించాలని, భరోసా ఇవ్వాలి అన్నట్లుగా కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నారని అంటున్నారు. మరోవైపు ఆయా ప్రాంతాల్లోని ప్రజలు.. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక బీడు భూములు పచ్చబడతాయని, తమ జీవితాలు బాగుపడతాయని భావిస్తున్నారు.




Updated : 16 Sep 2023 3:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top