Home > తెలంగాణ > కొడంగల్లో సీఎం రేవంత్ పర్యటన.. అభివృద్ధి పనులకు శ్రీకారం

కొడంగల్లో సీఎం రేవంత్ పర్యటన.. అభివృద్ధి పనులకు శ్రీకారం

కొడంగల్లో సీఎం రేవంత్ పర్యటన.. అభివృద్ధి పనులకు శ్రీకారం
X

కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం వెంట స్పీకర్ గడ్డం ప్రసాద్ సహా పలువురు మంత్రులు ఉన్నారు. ఆ తర్వాత మహిళా సంఘాలతో సీఎం సమావేశమయ్యారు. మహిళా సంఘాలను బలోపేతం చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. మహిళలకు కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామాల్లోని ఆడబిడ్డలకు చేతినిండ పని కల్పిస్తామన్నారు.

అభివృద్ది పనుల వివరాలు:

రూ.2,945 కోట్లతో నారాయణపేట్ - కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన

రూ.6.8 కోట్ల అంచనా వ్యయంతో కొడంగల్లో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్..

రూ.344.5 కోట్లతో కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా డబుల్ లేన్ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాలకు శంకుస్థాపన

రూ.27.886 కోట్లతో వికారాబాద్ జిల్లాలో బిటి రోడ్డు సదుపాయం లేని మారుమూల గిరిజన ప్రాంతాలకు రోడ్లు

రూ.5 కోట్లతో గిరిజన సంక్షేమ హాస్టల్ భవనానికి భూమి పూజ

రూ.25 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ శాశ్వత భవనానికి శంకుస్థాపన

రూ.40 కోట్లతో సీ.సీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

రూ.7.13 కోట్లతో దౌల్తాబాద్ జూనియర్ కాలేజికి శంకుస్థాపన

రూ. 7కోట్లతో బొమ్రాస్పేట్ జూనియర్ కాలేజికి శంకుస్థాపన

రూ.25 కోట్లతో నీటూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్/కాలేజికి శంకుస్థాపన

రూ.360 కోట్లతో చంద్రకల్లో నూతన వెటర్నరీ కాలేజి నిర్మాణానికి శంకుస్థాపన

రూ.30 కోట్లతో కోస్గిలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు శంకుస్థాపన

రూ.11 కోట్లతో కోస్గిలో మహిళా డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన

రూ.20 కోట్లతో మద్దూర్లో బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కాలేజీకి శంకుస్థాపన

రూ.25 కోట్లతో కొడంగల్లో బాయ్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కాలేజీ శంకుస్థాపన

రూ.224.50 కోట్లతో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజి, ఫిజియోథెరపీ కాలేజి, 220 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన

రూ. 213 కోట్లతో కొడంగల్ హెచ్ఎల్బీఎస్, R/Fs అప్రోచ్ రోడ్ పనులకు శంకుస్థాపన


Updated : 21 Feb 2024 2:03 PM GMT
Tags:    
Next Story
Share it
Top