Home > తెలంగాణ > ఢిల్లీకి సీఎం.. రెండ్రోజుల పాటు హస్తినలోనే రేవంత్

ఢిల్లీకి సీఎం.. రెండ్రోజుల పాటు హస్తినలోనే రేవంత్

ఢిల్లీకి సీఎం.. రెండ్రోజుల పాటు హస్తినలోనే రేవంత్
X

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన హస్తినలో బిజీగా గడపనున్నారు. సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా, ఇంటలిజెన్స్ ఛీప్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఈ రోజు ఢిల్లీలో నిర్వహించే ఏఐసీసీ సమావేశంలో రేవంత్ పాల్గొంటారు. కార్పొరేషన్ పోస్టుల భర్తీ ఇతర అంశాలపై ఆయన పార్టీ హైకమాండ్ తో చర్చించనున్నారు.మరోవైపు కేబినెట్ విస్తరణ అంశంపైనా పార్టీ పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం.

ఈ నెల 14న సీఎం రేవంత్ దావోస్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఈలోగా పదవులను భర్తీ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ పటిష్ఠత, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చేలా జాబితా రూపొందించినట్లు సమాచారం. ఈ జాబితాలపై అధిష్ఠానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో భేటీ కానున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరనున్నారు. రాత్రి 7గంటలకు సీఎంతో పాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కలవనున్నట్లు సమాచారం. పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ వినతిపత్రాన్ని ఇవ్వనున్నారు.

Updated : 4 Jan 2024 6:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top