Home > తెలంగాణ > Bandi Sanjay : ఆ పార్టీతోనే మాకు పోటీ బండి సంజయ్ కామెంట్స్

Bandi Sanjay : ఆ పార్టీతోనే మాకు పోటీ బండి సంజయ్ కామెంట్స్

Bandi Sanjay : ఆ పార్టీతోనే మాకు పోటీ బండి సంజయ్ కామెంట్స్
X

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని బీజేపీని ఓడించేందుకు ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు చీకటి ఒప్పందులు కుదుర్చుకున్నారు. కాంగ్రెస్‌ బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని.. బీజేపీ ని ఓడించేందుకే ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని.. అసలు విషయం ఏంటో ప్రజలకు తెలుసునని.. మాకు పోటీ కాంగ్రెస్‌తోనేనని.. బీఆర్ఎస్‌ది మూడో స్థానమని అన్నారు.

కాంగ్రెస్ నేతలు అసత్యప్రచారాలు చేస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేసీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని అన్నారని, పోటీ చేశామా? దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఐదారు రోజులలో అభ్యర్థులను ప్రకటించబోతోందని బండి సంజయ్ తెలిపారు. గ్రామాలవారీగా ఏం అభివృద్ధి చేసింది.. కేంద్రం ఏ మేరకు నిధులు ఇచ్చింది.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తదితర అంశాలతో ప్రజాహిత యాత్ర ప్రచారంలోకి వెళతామని, అలాగే నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రి చేయాలన్న ఆలోచనతో యాత్ర కొనసాగిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. విపక్ష పార్టీలు అన్ని సింగిల్ డిజిట్‌కు పరిమితం అయ్యే పరిస్థితి ఉందని ఆయన తెలిపారు.




Updated : 26 Feb 2024 6:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top