Home > తెలంగాణ > కాంగ్రెస్ తుది జాబితా విడుదల.. ఆ స్థానంలో అభ్యర్థి మార్పు

కాంగ్రెస్ తుది జాబితా విడుదల.. ఆ స్థానంలో అభ్యర్థి మార్పు

కాంగ్రెస్ తుది జాబితా విడుదల.. ఆ స్థానంలో అభ్యర్థి మార్పు
X

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల తుది జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఐదుగురు అభ్యర్థులతో ఫైనల్ లిస్ట్ రిలీజ్ అయ్యింది. పటాన్ చెరులో అభ్యర్థిని మార్చింది. ఇంతకుముందు నీలం మధును కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించగా.. ఆయన స్థానంలో కాటా శ్రీనివాస్ గౌడ్కు టికెట్ ఇచ్చింది. తుంగతుర్తి నుంచి టికెట్ ఆశించిన అద్దంకి దయాకర్ను నిరాశే ఎదురైంది. తుంగతుర్తి టికెట్ను మందుల శామ్యూల్కు ఇచ్చింది. సూర్యపేట్ నుంచి టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి కూడా మొండిచెయి చూపింది. ఆ టికెట్ను సీనియర్ నేత ఆర్.దామోదర్ రెడ్డికి కేటాయించింది.

కాంగ్రెస్ జాబితా

పటాన్ చెరు - కాటా శ్రీనివాస్ గౌడ్

సూర్యాపేట - దామోదర్ రెడ్డి

తుంగతుర్తి - శామ్యూల్

మిర్యాలగూడ - లక్ష్మారెడ్డి

చార్మినార్ - ముజీబ్ ఉల్లా షరీఫ్


Updated : 9 Nov 2023 4:56 PM GMT
Tags:    
Next Story
Share it
Top