Home > తెలంగాణ > మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి.. సీఎం అయ్యాక ఇది 6 వ సారి

మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి.. సీఎం అయ్యాక ఇది 6 వ సారి

మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి..  సీఎం అయ్యాక ఇది 6 వ సారి
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం ఢిల్లీకి బయల్దేరారు. సీఎం రేవంత్ సహ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరికొంతమంది మంత్రులు సహా లోక్​సభ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, ఏఐసీసీ ఇన్​చార్జులు ఢిల్లీకి పయనమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఏఐసీసీ కార్యాలయంలో లోక్ సభ ఎన్నికల కోఆర్డినేటర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రేవంత్, భట్టి పాల్గొనున్నారు. అలాగే ఈ సమావేశంలో కాంగ్రెస్ ఇన్‌చార్జి మున్షీ, పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్లుగా మంత్రులు పాల్గొననున్నారు. లోక్​సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకులకు పార్టీ హైకమాండ్​దిశానిర్దేశం చేయనుంది.

లోక్​సభ ఎన్నికలపై చర్చించిన అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్​పదవుల భర్తీపైనా అధిష్ఠానంతో పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 17 పార్లమెంట్ స్థానాల్లో ఇప్పటికే సునీల్ కనుగోలు టీం సర్వేలు చేస్తోంది. కనీసం 15 పార్లమెంట్ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ నెల 15న సీఎం అమెరికా (దావోస్‌) పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వకర్తలతో సమీక్షలు నిర్వహిస్తారని కాంగ్రెస్‌ వర్గాల సమాచారం.

Updated : 11 Jan 2024 3:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top