రిజల్ట్ వచ్చాక సగం మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉండరు - ధర్మపురి అర్వింద్
Kiran | 26 Oct 2023 4:30 PM GMT
X
X
డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సగం మంది ఆ పార్టీలో ఉండరని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ హేమాహేమీలకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన అర్వింద్.. నిజామాబాద్ లోక్ సభ సెగ్మెంట్లో 7 స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పారు.
గత పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన కవితకు తమ గురించి మాట్లాడే అర్హత లేదని అర్వింద్ అన్నారు. కవిత ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓటమి తప్పదని అన్నారు. కోరుట్లలో 20శాతానికి పైగా ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని, ఉత్తర తెలంగాణలో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.
Updated : 26 Oct 2023 4:30 PM GMT
Tags: telangana ts election ts politics assembly election congress party bjp mp arvind north telangana nizamabad assembly segment kavitha korutla majority cleansweep
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire