Home > తెలంగాణ > Mallikarjun Kharge: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులమయం చేసిందెవరు - ఖర్గే

Mallikarjun Kharge: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులమయం చేసిందెవరు - ఖర్గే

Mallikarjun Kharge: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులమయం చేసిందెవరు - ఖర్గే
X

మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పులమయం చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు. సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్లలో రాష్రాన్ని అప్పులమయం చేసింది ఎవరని ప్రశ్నించారు. సీఎం అయి తనకు కావాల్సినవన్నీ చేసుకున్న కేసీఆర్.. రైతులు, విద్యార్థులు, యువతను పట్టించుకోలేదని ఖర్గే విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తుందని మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఎంతో ఆలోచించి ఈ ఆరు గ్యారెంటీలను రూపొందించామని అన్నారు. మహాలక్ష్మీ, రూ.500లకే సిలిండర్, మహిళలకు బస్సుల్లో ఫ్రీ ప్రయాణం తదితర హామీలను కచ్చితంగా అమలుచేస్తామని చెప్పారు. రైతులకు ఏటా రూ.15వేలు ఇస్తమన్న ఆయన చెప్పినవన్నీ చేసి చూపిస్తామని అన్నారు. కర్నాటకలో గ్యారెంటీల అమలుపై అనుమానాలుంటే లగ్జరీ బస్సు ఏర్పాటు చేస్తాం వెళ్లిచూడండని బీఆర్ఎస్ నాయకులకు ఖర్గే చురకలంటించారు.

Updated : 29 Oct 2023 10:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top