Home > తెలంగాణ > కేసీఆర్, హరీష్ రావులపై ఈసీకి ఫిర్యాదు

కేసీఆర్, హరీష్ రావులపై ఈసీకి ఫిర్యాదు

కేసీఆర్, హరీష్ రావులపై ఈసీకి ఫిర్యాదు
X

సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని.. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. కాంగ్రెస్‌ను దోకేబాజి పార్టీ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని ఆరోపించింది. మంత్రి హరీష్ రావు సైతం కాంగ్రెస్ మేనిఫెస్టోను 420 మేనిఫెస్టో అంటూ విమర్శించారని.. ఇది కూడా కోడ్‌ ఉల్లంఘన కిందికే వస్తుందని ఫిర్యాదులో తెలిపింది.

కాగా ఇటీవలే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ఈసీకి ఫిర్యాదు చేసింది. రేవంత్‌రెడ్డి బహిరంగ సభల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. యాడ్స్లో కూడా కేసీఆర్‌ను కించపరుస్తున్నారని.. వెంటనే తగిన చర్యలను తీసుకోవాలని కోరింది.


Updated : 18 Nov 2023 2:05 PM GMT
Tags:    
Next Story
Share it
Top