Home > తెలంగాణ > సోనియాతో షర్మిల భేటీ..బయటికి వచ్చి ఏమన్నారంటే

సోనియాతో షర్మిల భేటీ..బయటికి వచ్చి ఏమన్నారంటే

సోనియాతో షర్మిల భేటీ..బయటికి వచ్చి ఏమన్నారంటే
X

ఢిల్లీలో కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ నివాసంలో వై.ఎస్.షర్మిల భేటీ ముగిసింది. సోనియా, రాహుల్ ను కలిసిన షర్మిల తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో వైఎస్‎ఆర్‎టీపీని విలీనం చేయబోతున్నారన్న వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారాయి. దీనికి సంబంధించి తుది చర్చలు జరపడానికే ఈ రోజు షర్మిల ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్‌టీపీ నేతలకు గానీ, భద్రతా సిబ్బందికి గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఒక్కరే తన భర్తతో కలిసి సోనియా గాంధీని షర్మిల కలిశారు. సమావేశం అనంతరం కేసీఆర్‎పై షర్మిల పంచ్ డైలాగులు పేల్చారు.

" సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిశాను. మా మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరం పని చేస్తుంది. కేసీఆర్‎కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది"అని అన్నారు. అయితే సోనియా గాంధీతో భేటీ తర్వాత విలీనంపై స్పష్టత వస్తుందని అంతా భావించినప్పటికీ , పార్టీ విలీనంపై షర్మిల ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి రోజు ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. విలీనం తర్వాత ఆంధ్రప్రదేశ్‎లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. షర్మిల మాత్రం అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.



Updated : 31 Aug 2023 5:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top