Home > తెలంగాణ > ఎంపీ ఎన్నికల్లో కలిసి వెళ్దాం.. కాంగ్రెస్‌కు సీపీఐ విజ్ఞప్తి

ఎంపీ ఎన్నికల్లో కలిసి వెళ్దాం.. కాంగ్రెస్‌కు సీపీఐ విజ్ఞప్తి

ఎంపీ ఎన్నికల్లో కలిసి వెళ్దాం.. కాంగ్రెస్‌కు సీపీఐ విజ్ఞప్తి
X

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కలిసి వెళ్దామని సీఎం రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తావించినట్లు తెలిపారు. కాంగ్రెస్ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని.. తమకు ఒక స్థానాన్ని కేటాయించాలని కోరారు. పలు పార్లమెంట్ స్థానాల్లో తాము బలంగా ఉన్నామన్నారు. తాము నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ పార్లమెంట్ స్థానాలలో ఒకదానిని అడుగుతున్నామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కూనంనేని చెప్పారు. ప్రజలు ఎన్నో ఆశలతో కాంగ్రెస్ను ఎన్నుకున్నారని.. వారి ఆశలు వమ్ము కాకుండా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉందని.. ఆరు నెలల గడువు ఇచ్చి తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం మారిందనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు మరచిపోతున్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పని పేపర్ మీద తప్ప ప్రాక్టికల్‌గా ఏమీ లేదని ఆరోపించారు.


Updated : 4 Jan 2024 12:51 PM GMT
Tags:    
Next Story
Share it
Top