Home > తెలంగాణ > Barrelakka: బర్రెలక్కపై దాడి.. గవర్నర్కు వినతి పత్రం

Barrelakka: బర్రెలక్కపై దాడి.. గవర్నర్కు వినతి పత్రం

Barrelakka: బర్రెలక్కపై దాడి.. గవర్నర్కు వినతి పత్రం
X

తెలంగాణ ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలన్నీ డబ్బు, మద్యం పంచుతున్నాయని, పోలీస్ వెహికల్స్ లో అధికార పార్టీ అభ్యర్థులు డబ్బులు తరలిస్తున్నారని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆరోపించింది. ప్రజాస్వామ్యంబద్దంగా ఎన్నికలు జరిగేలా చూడాలని గవర్నర్ తమిళి సైని కోరారు. బుధవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన వేదిక నిర్వాహకులు, సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, మామిడి సోమయ్య, ఆనం చిన్ని వెంకటేశ్వరరావుతో పాటు పలువురు వినతి పత్రం అందించారు. పెండ్లిల్లు, ఇతర పనుల నిమిత్తం సాధారణ ప్రజలు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉంటుందని, పోలీసులు, ఎన్నికల కమిషన్ వాటిని సీజ్ చేస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

పోలింగ్ నాడు రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని, అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కొల్లాపూర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నె శిరీష్ అలియాస్ బర్రెలక్క తమ్ముడిపై జరిగిన దాడిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, బర్రెలక్కకు భద్రత కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన గవర్నర్ పూర్తి వివరాలు తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.




Updated : 23 Nov 2023 6:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top