Home > తెలంగాణ > Minister Sridhar Babu : గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఆపం

Minister Sridhar Babu : గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఆపం

Minister Sridhar Babu : గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఆపం
X

మూసీనదిని అద్భుతంగా తీర్చిదిద్ది చూపిస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీదర్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతే తమ విజన్ అన్నారు. 3 దశాబ్థాలుగా స్థిరాస్తి రంగం ఎంతో పుంజుకుందని మంత్రి అన్నారు. దావోస్ పర్యటనలో మౌలిక వసతులపై కూడా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఆపబోమని ఆయన అన్నారు. సీఐఐ ఇన్‌ఫ్రాస్టక్చర్ & రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లో పాల్గోన్నారు..ప్రతి రాష్ట్రం హైదరాబాద్ వైపు చూస్తోంది. రష్యాలాంటి దేశాల్లోని పారిశ్రామిక వేత్తలు కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నారన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నామన్నారు.ఈ ప్రభుత్వం మూసీ నదిని ప్రక్షాళన చేస్తుందా.. అని అవహేళనగా మాట్లాడుతున్నారన్నారు. ఆరు గ్యారంటీలు అసాధ్యమని కొందరు అంటున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుందా అని మాట్లాడుకున్నారు.. తెలంగాణలో గెలిచి చూపించామన్నారు.మూసీ నదిని పునరుజ్జీవింపజేస్తే, స్వచ్ఛమైన నది, అనేక పెద్ద సరస్సులతో హైదరాబాద్‌ ప్రపంచంలోనే విశిష్ట నగరంగా నిలుస్తుందని దుబాయ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దుబాయ్‌లో అగ్రశ్రేణి గ్లోబల్ సిటీ ప్లానర్లు మరియు డిజైనర్లతో జరిగిన వివరణాత్మక చర్చలో, నదులు మరియు సరస్సులు సహజంగా పట్టణ ప్రాంతాలను నిర్వచించడంతో చారిత్రక నగరాలు జలాల సమీపంలో అభివృద్ధి చెందాయని ముఖ్యమంత్రి హైలైట్ చేశారు.దుబాయ్‌లో జరిగే చర్చలు 70కి పైగా విభిన్న ప్రధాన గ్లోబల్ డిజైన్, ప్లానింగ్ ఆర్కిటెక్చర్ సంస్థలు, కన్సల్టెన్సీలు మరియు నిపుణులతో వివిధ సమావేశాల నిర్వహించారు. దాదాపు అన్ని సంస్థలు హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. తదుపరి సంప్రదింపుల కోసం వారు రాబోయే రోజుల్లో తెలంగాణకు రానున్నారని మంత్రి శ్రీధర్ తెలిపారు.

Updated : 25 Jan 2024 7:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top