Home > తెలంగాణ > ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు...రేపు విచారణ..

ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు...రేపు విచారణ..

ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు...రేపు విచారణ..
X

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు పంపారు. రేపు(శుక్రవారం) విచారణ కోసం ఢిల్లీకి రావాలని తెలిపారు. ఈ కేసు నిందితుల్లో ఒకరైన కవిత హైదరాబాద్ వ్యాపారి అరుణ్ పిళ్లై అప్రూవర్‌గా మారడంతో ఈడీ ఆమెకు తాజా నోటీసులు పంపింది. పిళ్లై ఈడీ అధికారులకు కీలక సమాచారం ఇవ్వడంతో కవితను మరోసారి విచారణకు పిలిపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో ఈడీ అధికారులు కవితను ఇప్పటికే మూడుసార్లు విచారించారు. కొన్ని నెలలుగా కదలిక లేని ఈ కేసుపై ఈడీ మళ్లీ దృష్టి సారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లిక్కర్ లైసెన్సు బాగోతంలో పిళ్లై కవిత బినామీగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితులైన వైసీపీ ఎంపీ శ్రీనివాసుల రెడ్డి, ఆయన కొడుకు రాఘవరెడ్డి కూడా అప్రూవర్లుగా మారడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ‘లిక్కర్’ రాజకీయం వేడెక్కింది.

Updated : 14 Sep 2023 8:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top