Home > తెలంగాణ > రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలు.. ఉద్రిక్తత..

రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలు.. ఉద్రిక్తత..

రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలు.. ఉద్రిక్తత..
X

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో ఎలక్షన్ స్క్వాడ్ సహా టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది. జూబ్లీహిల్స్లోని గోయల్ ఇంట్లో భారీగా డబ్బు డంపు చేశారని సమాచారంతో అధికారులు సోదాలు చేపట్టారు. గోయల్ 2010లో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుడిగా పనిచేశారు. ఈ సమాచారంతో కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి పెద్దఎత్తున చేరుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నాడంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అతడి బైక్‌ను అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలపై పోలీసులు లాఠీ‌చార్జ్ చేశారు.

Updated : 24 Nov 2023 5:10 PM GMT
Tags:    
Next Story
Share it
Top