Home > తెలంగాణ > అప్పు కోసం రేవంత్ కేంద్రం చుట్టూ తిరుగుతుండు - Eetala

అప్పు కోసం రేవంత్ కేంద్రం చుట్టూ తిరుగుతుండు - Eetala

అప్పు కోసం రేవంత్ కేంద్రం చుట్టూ తిరుగుతుండు - Eetala
X

మోడీ నాయకత్వంలో దేశం పురోగతి సాధిస్తోందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. అందుకే మోడీని మూడోసారి ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా యాదగిరి గుట్టలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఈటల పాల్గొన్నారు. అనంతరం బస్సు యాత్రలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ హామీలపై ప్రజలకు భ్రమలు తొలిగిపోతున్నాయని, ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగినా.. బస్సులు మాత్రం పెరగలేదని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని ఈటల చెప్పారు. అందుకే అప్పు కోసం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తే వృథా అవుతుందని ఈటల అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటేయాలని కోరారు.

లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ఈటల ప్రకటించారు. బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని చెప్పారు. ఒకవేళ మల్కాజ్గిరి టికెట్ నుంచి అక్కడి నుంచే బరిలో దిగుతానని స్పష్టం చేశారు. తాను 32 ఏండ్లుగా మల్కాజ్గిరిలో ఉంటున్నానని ఆ స్థానం నుంచి పోటీ చేయాలన్నది తన మనసులో మాట అని చెప్పారు.

కేసీఆర్ మానవ అద్భుతమని ప్రశంసించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలిపోయే స్థితి చేరిందని ఈటల విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లు కొత్తగా వచ్చినవి కావని, గతంలో భారీ వర్షాలు పడ్డప్పుడే కాళేశ్వరం మోటర్లన్నీ పాడయ్యాయని, అందుకే అప్పట్లో తమను కాళేశ్వరం వెళ్లకుండా అడ్డుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఈటల డిమాండ్ చేశారు.

Updated : 21 Feb 2024 7:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top