Home > తెలంగాణ > కేసీఆర్ ప్రమాణస్వీకారం.. ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా..

కేసీఆర్ ప్రమాణస్వీకారం.. ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా..

కేసీఆర్ ప్రమాణస్వీకారం.. ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా..
X

గజ్వేల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ప్రసాద్ ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లంతా హాజరయ్యారు. అయితే ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రంప్రమాణస్వీకారానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కేసీఆర్ ప్రమాణస్వీకారానికి రాలేదు. అయితే వారంతా వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేదా లేక రాజకీయ కోణం ఉందా అన్న అంశం హాట్ టాపిక్గా మారింది.

కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటీవలే ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో వారంతా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి మారుతారన్న ఊహాగానాలు వినిపించాయి. తాజాగా కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి డుమ్మా కొట్టడం వాటికి మరింత బలం చేకూర్చింది.

Updated : 1 Feb 2024 1:38 PM GMT
Tags:    
Next Story
Share it
Top