Home > తెలంగాణ > Breaking News: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాలుడి కిడ్నాప్..

Breaking News: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాలుడి కిడ్నాప్..

Breaking News: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాలుడి కిడ్నాప్..
X

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఐదేండ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం ఫ్లాట్ ఫాం నెంబర్ 1 వద్ద అబ్బాయి కనిపించకుండా పోయాడు. తండ్రి వాష్ రూంకు వెళ్లి వచ్చేలోగా ఓ మహిళతో పాటు మరో వ్యక్తి బాలుడిని తీసుకెళ్లిపోయాడు. తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో వారి రైల్వే పోలీసులకు ఫిర్యాదుచేశారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మెదక్ జిల్లా రాయలపురం గ్రామానికి చెందిన దుర్గేష్ తన భార్య, చెవిటి, మూగ అయిన ఐదేళ్ల కొడుకు శివసాయితో కలిసి తిరుపతి వెళ్లారు. గురువారం తిరుగుపయనమైన వారు శుక్రవారం ఉదయం 5.30గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకున్నారు. అలసటగా ఉండటంతో సాయంత్రం వరకు స్టేషన్లోనే రెస్ట్ తీసుకున్నారు. దుర్గేష్ కొడుకును లగేజ్ బ్యాగు వద్దనే ఉండమని చెప్పి వాష్ రూంకు వెళ్లాడు. తిరిగి వచ్చేలోగా బాలుడు కనిపించలేదు.

కొడుకు కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికిన పేరెంట్స్ ఫలితంలేకపోవడంతో రైల్వే పోలీసులను ఆశ్రయించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించిన పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. అతని వెంట ఓ మహిళ కూడా ఉన్నట్లు వీడియోలో కనిపించింది. కిడ్నాప్ కేసు నమోదుచేసిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బెగ్గింగ్ మాఫియా పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Updated : 30 Sep 2023 6:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top