Home > తెలంగాణ > మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్‌ రెడ్డి కన్నుమూత..కేసీఆర్‌ సంతాపం

మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్‌ రెడ్డి కన్నుమూత..కేసీఆర్‌ సంతాపం

మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్‌ రెడ్డి కన్నుమూత..కేసీఆర్‌ సంతాపం
X

పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి తండ్రి మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి(76) మరణించారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. పరిగిలోని తన ఇంట్లో శుక్రవారం రాత్రి 10.10 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రాగా.. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు.

వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన హరీశ్వర్‌రెడ్డి పరిగి ఉపసర్పంచ్‌గా, 1978లో సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికలలో పరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పరిగిలో జరగనున్నాయి. హరీశ్వర్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.

హరీశ్వర్‌రెడ్డి మృతి పట్ల సీఎం సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రజలకు హరీశ్వర్‌రెడ్డి చేసిన సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు. పరిగి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజాభిమానం పొందిన నాయకుడు హరీశ్వర్‌రెడ్డి అని కొనియాడారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సహా ఆయన కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


Updated : 23 Sep 2023 3:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top