Home > తెలంగాణ > MP Hanumantha Rao : మోదీ అయోధ్యను ఆయుధంగా వాడుకుంటున్నరు: మాజీ ఎంపీ హనుమంతరావు

MP Hanumantha Rao : మోదీ అయోధ్యను ఆయుధంగా వాడుకుంటున్నరు: మాజీ ఎంపీ హనుమంతరావు

MP Hanumantha Rao : మోదీ అయోధ్యను ఆయుధంగా వాడుకుంటున్నరు: మాజీ ఎంపీ హనుమంతరావు
X

ప్రధాని మోదీ, బీజేపీ అయోధ్య రామమందిరాన్ని ఆయుధంగా వాడుకుంటున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హనుమంతరావు ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ.. ఆయోధ్య ఎత్తుగడ వేశారని విమర్శించారు. మంగళవారం (జనవరి 23) గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. మణిపూర్ లో అంతపెద్ద హింసకాండ జరిగినా కాస్తైనా చలించలేదని మండిపడ్డారు.

బాధ్యతాయుత పదవిలో ఉండి కూడా.. ఆ విషయంపై కనీసం స్పందించలేదని హనుమంతరావు ధ్వజమెత్తారు. మోదీ రాముడు.. రాహుల్ గాంధీ రావణుడి అనటం దారుణం అని ఆయన ఫైర్ అయ్యారు. రాముడు కొందిరివాడు కాదని.. ఆయన అందరికీ చెందిన వాడని హనుమంతరావు గుర్తుచేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మెజారిటీ స్థానాల్లో ఎంపీ సీట్లను గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.






Updated : 23 Jan 2024 1:41 PM GMT
Tags:    
Next Story
Share it
Top