Home > తెలంగాణ > అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X

అసెంబ్లీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో తాను ఉండకపోవచ్చన్నారు. ఇంటా బయటా తాను అసెంబ్లీకి రావొద్దని కోరుకుంటున్నారని బాంబు పేల్చారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ధూల్ పేట్ లో పర్యటిస్తానని, అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పి మాట తప్పారన్నారు. అసెంబ్లీలో తానున్నా లేకున్నా ధూల్ పేట్ ని అభివృద్ధి చేయాలని స్పీకర్ ని రాజాసింగ్ కోరారు.

వచ్చే అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చునని అన్నారు రాజాసింగ్. అంటే తదుపరి ఎన్నికల తరువాత ఏర్పడే అసెంబ్లీకి తాను రాకపోవచ్చునని అన్నారు. అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారాయి. ఆదివారం అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాల్లో మాట్లాడిన ఎమ్మెల్యే రాజాసింగ్.. ఇంటా బయటా తనను అసెంబ్లీకి రావొద్దనే కోరుకుంటున్నారని అన్నారు. అయితే మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా రాజాసింగ్ బీజేపీ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.

Updated : 6 Aug 2023 6:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top