Home > తెలంగాణ > పెద్దపల్లి జిల్లాలో ‘ఉగ్ర’ కలకలం.. పోలీసుల అదుపులో తండ్రీకూతుళ్లు

పెద్దపల్లి జిల్లాలో ‘ఉగ్ర’ కలకలం.. పోలీసుల అదుపులో తండ్రీకూతుళ్లు

పెద్దపల్లి జిల్లాలో ‘ఉగ్ర’ కలకలం.. పోలీసుల అదుపులో తండ్రీకూతుళ్లు
X

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మంగళవారం రాత్రి వేళ 'ఉగ్ర' కలకలం రేపింది. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఇద్దరు తండ్రీకూతుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. మంగళవారం రాత్రి పక్కా సమాచారం మేరకు గుజరాత్ ఆంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం.. గోదావరిఖని లోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్న.. మహమ్మద్ జావిద్ (46) తో పాటు అతని కూతురు ఖతిజా (19) ను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఉగ్రవాదులకు సాయం చేస్తున్నారని అనుమానిస్తున్నారు.

అమీర్‌పేట్‌లో సాఫ్ట్‌వేర్ ట్రైనర్

జావిద్ హైదరాబాద్ లోని అమీర్‌పేట్‌లో ఓ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్ ట్రైనర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. కూతురితో కలిసి నగరంలోని టోలిచౌక్ లో నివాసం ఉంటున్నారు. బక్రీద్ పండుగ కోసమని ఇద్దరూ గోదావరిఖనికి వచ్చినట్టు సమాచారం. అయితే వీరు ఏ టెర్రరిస్ట్ సంస్థతో సంబంధాలు ఏర్పర్చుకున్నారు, వీరి ప్రమేయం ఎంత మేర అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

ఆచూకీ దొరకబట్టుకొని మరీ..

సాంకేతికంగా టెర్రరిస్ట్ సంస్థలకు సహకరిస్తున్నారా లేక ఇతరత్రా సహాకారం అందిస్తున్నారా అన్న విషయం తేలాల్సి ఉంది. అనుమానితులగా మాత్రమే తీసుకెళ్తున్నామని ఏటీఎస్ బృందాలు స్థానిక పోలీసు అధికారులకు వివరించినప్పటికీ వీరి ఆచూకి దొరకబట్టుకుని మరీ రామగుండం పారిశ్రామిక ప్రాంతం వరకు వచ్చి అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. ఏది ఏమైనా మరో సారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన వారి గురించి గుజరాత్ ఏటీఎస్ టీమ్స్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

Updated : 28 Jun 2023 4:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top