Home > తెలంగాణ > పాత బస్తీలో తుపాకీ పేలుడు.. హెడ్ కానిస్టేబుల్ మృతి

పాత బస్తీలో తుపాకీ పేలుడు.. హెడ్ కానిస్టేబుల్ మృతి

పాత బస్తీలో తుపాకీ పేలుడు.. హెడ్ కానిస్టేబుల్ మృతి
X

హైదరాబాద్ పాతబస్తీలో తుపాకీ పేలుడు కలకలం రేపింది. ఓ హెడ్ కానిస్టేబుల్ చేతిలో తుపాకీ మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే.. పాతబస్తీ హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో భూపతి శ్రీకాంత్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి విధులు ముగించుకున్న శ్రీకాంత్.. పడుకునే సమయంలో చేతిలోని తుపాకీ ప్రమదవశాత్తు పేలింది. ఈ ఘటనలో శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో పడి ఉన్న శ్రీకాంత్‌ను గమనించిన తోటి సిబ్బంది వెంటనే అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్ కన్నుమూశాడు.

నెల క్రితం కూడా తుపాకీ మిస్ ఫైర్ అయి ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో మంచిర్యాల జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ రామయ్య ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ప్రాణాలు కోల్పోయాడు. అతడు సెక్యూరిటీ గార్డుగా మింట్ కాంపౌండ్‌లో విధులు నిర్వహిస్తుండగా.. చేతిలోని తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఈ ఘనటలో అతడికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ రామయ్య ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి కుటుంబంలో విషాదం అలుముకుంది.




Updated : 23 Aug 2023 3:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top