Home > తెలంగాణ > హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా.. రేపటి షెడ్యూల్ ఇదే..

హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా.. రేపటి షెడ్యూల్ ఇదే..

హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా.. రేపటి షెడ్యూల్ ఇదే..
X

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసర్స్ మెస్ కు వెళ్లనున్నారు. కాసేపట్లో ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అమిత్ షాను కలవనున్నారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై అసెంబ్లీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, చేపట్టాల్సి కార్యక్రమాల గురించి చర్చించనున్నట్లు సమాచారం.

సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విమోచన దినోత్సవంలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం 8.35 గంటలకు ఆయన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కు చేరుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అక్కడ జరిగే వేడుకల్లో పాల్గొంటారు. 11.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరనున్న అమిత్ షా.. ఉదయం 11.50 గంటలకు స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తిరిగి వెళ్తారు.




Updated : 16 Sep 2023 3:22 PM GMT
Tags:    
Next Story
Share it
Top