Home > తెలంగాణ > హైదరాబాద్‌లో నీళ్లు బంద్..మీ కాలనీ ఉందేమో చూసుకోండి

హైదరాబాద్‌లో నీళ్లు బంద్..మీ కాలనీ ఉందేమో చూసుకోండి

హైదరాబాద్‌లో నీళ్లు బంద్..మీ కాలనీ ఉందేమో చూసుకోండి
X

హైదరాబాద్ వాసులకు బ్యాడ్ న్యూస్. ఆగస్టు 19 తేదీ నుంచి 20వ తేదీ వరకు 30 గంటల పాటు మంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు జలమండలి ప్రకటించింది. మంజీరా వాటర్ సప్లై ఫేజ్ -2 లోని పైపు లైన్లకు మరమత్తులు చేపడుతున్న దృష్ట్యా పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ విషయమై హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ తాజాగా ఓ ప్రకటన చేసింది. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరింది. నీటి సరఫరాకు అంతరాయం ఏర్పండే కాలనీ వాసులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.





మంజీరా వాటర్ సప్లై ఫేజ్ -2 లో పైపులైన్‎కు జంక్షన్ పనులను చేపట్టనున్నారు జలమండలి అధికారులు. కలబ్ గూర్ నుంచి పటాన్ చెరు , పటాన్ చెరు నుంచి హైదర్ నగర్ వరకు ఈ పనులు జరుగనున్నాయి. ఈ ప్రాంతాల్లో ఆర్ అండ్ బీ శాఖ బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్ వద్ద నూతనంగా నిర్మిస్తోన్న ఫ్లై ఓవర్ పనులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 30 గంటలపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఆగస్టు 19 ఉదయం 6 గంటల నుంచి నల్లా నీరు నిలిచిపోనుంది.





హైదరాబాద్ మహానగరంలోని దాదాపు 16 కాలనీల్లో నీరు నిలిచిపోనుంది. మరికొన్న ప్రాంతాల్లో పాక్షికంగా అంతరాయం ఏర్పడనుంది. ఆగస్టు 19 శనివారం ఉదయం 6 గంటలు మరుసటి రోజు 20 తేదీ వరకు అంటే ఆదివారం వరుక జంక్షన్ పనులు జరుగనున్నాయి. దీంతో మొత్తం 30 గంటల పాటు నల్లా నీటిని బంద్ చేయనున్నారు. ఎర్రగడ్డ, అమీర్‌పేట, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరి గుట్ట, ఎల్లారెడ్డిగూడ, ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారాం, దీప్తి శ్రీ నగర్, మదీనా గూడ, మియాపూర్ వంటి ప్రాంతాల్లో నీళ్లకు అంతరాయం ఏర్పడనుంది. ఈ క్రమంలో నగర ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జలమండలి సూచించింది. నీటిని పొదుపుగా వాడాలని కోరింది.







Updated : 16 Aug 2023 2:30 PM GMT
Tags:    
Next Story
Share it
Top