Home > తెలంగాణ > రాష్ట్రంలో మరోసారి ఐటీ సోదాలు.. ఈసారి టార్గెట్‌గా BRS అభ్యర్థి

రాష్ట్రంలో మరోసారి ఐటీ సోదాలు.. ఈసారి టార్గెట్‌గా BRS అభ్యర్థి

రాష్ట్రంలో మరోసారి ఐటీ సోదాలు.. ఈసారి టార్గెట్‌గా BRS అభ్యర్థి
X

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. రాష్ట్రంలో వరుస ఐటీ దాడులు సంచలనం రేపుతున్నాయి. రాజకీయ నాయకులే లక్ష్యంగా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లుగా ఉంది. ఈ సారి బీఆర్ఎస్ నేత టార్గెట్‌గా ఈ దాడులు జరగుతున్నాయి. మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మిర్యాలగూడతో పాటు నల్గొండ, హైదారాబాద్‌లోని ఆయన నివాసాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిన్నారు. మెుత్తం 40 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. నల్లమోతు భాస్కర్ రావుకు దేశ వ్యాప్తంగా పలు వ్యాపారాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు భారీగా డబ్బు నిల్వచేసినట్లు ఆరోపణలు వస్తున్న క్రమంలో ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు.

ఇటీవల మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుల ఇళ్లపై కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు. సోమవారం (నవంబర్ 13) మెుదలైన ఐటీ సోదాలు బుధవారం (నవంబర్ 15) ముగిశాయి. ఈ సోదాల్లో సబితా అనుచరులుగా ప్రచారం జరుగుతున్న నరేందర్ రెడ్డి ఇంట్లో 7.50 కోట్లు, ప్రదీప్ రెడ్డి ఇంట్లో రూ.5 కోట్లకు పైగా డబ్బును ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఈ నగదును మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్నదిగా ప్రచారం జరుగుతోంది. ప్రదీప్ రెడ్డి, నరేందర్ రెడ్డికి మంత్రి సబితా కుమారుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ఐటీ అధికారులు విచారణలో గుర్తించారు.

కొన్ని వారాల క్రితం మహేశ్వరం నియోజవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు పారిజాత నర్సింహా రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎల్‌ఆర్ ఇంట్లోనూ ఐటీ సోదాలు జరిగాయి. మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సన్నిహితుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తుమ్మల నాగేశ్వ రావు ఇంట్లో పోలీసులు దాడులు చేసారు. ఆ సమయంలో స్పందించిన టీపీసీసీ రేవంత్ కాంగ్రెస్ నేతల ఇళ్లే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. దీని వెనుక బీఆర్ఎస్, బీజేపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా ఐటీ దాడులు జరగటం కలకలం రేపుతోంది.

Updated : 16 Nov 2023 3:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top