Home > తెలంగాణ > బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం.. ఎంఐఎం సీ టీం: జైరాం రమేష్

బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం.. ఎంఐఎం సీ టీం: జైరాం రమేష్

బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం.. ఎంఐఎం సీ టీం: జైరాం రమేష్
X

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. బీఆన్ఎస్.. బీజేపీకి బీ టీం అని, ఎంఐఎం సీ టీం అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో సామాజిక న్యాయం జరిగినట్లు ఎక్కడా కనిపించట్లేదని ఆరోపించారు. పెట్టుబడులన్నీ హైదరాబాద్ లో కేంద్రీకృతమయ్యాయని, ఇతర ప్రాంతాలకు పెట్టుబడులను విస్తరించలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. కర్నాటకలో గెలుపు, భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకం కలిగిందని జైరాం రమేష్ అన్నారు. గతేడాది అక్టోబర్ లో రాహుల్ గాంధీ జోడో యాత్ర చేశారని, అందులో భాగంగా తెలంగాణలో 405 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. అదే తెలంగాణలో కొత్త ఊపు తీసుకొచ్చిందని, టీ కాంగ్రెస్ నేతల్లో విశ్వాసం నింపిందన్నారు.


Updated : 24 Nov 2023 8:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top