Home > తెలంగాణ > KCR : ఢిల్లీకి కేసీఆర్....బీజేపీతో పొత్తు కోసమేనా?

KCR : ఢిల్లీకి కేసీఆర్....బీజేపీతో పొత్తు కోసమేనా?

KCR : ఢిల్లీకి కేసీఆర్....బీజేపీతో పొత్తు కోసమేనా?
X

గులాబీ బాస్ కేసీఆర్ ఢీల్లీకి వెళ్లనున్నారు. ఈ వారంలోనే ఆయన హాస్తిన టూర్ ఉంటుందని సమాచారం. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా గత ఏడాది సర్జరీ తర్వాత ఇయన రెండు నెలల పాటు రెస్ట్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. ఇటీవల నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ సభలో కూడా ఆయన పాల్గొన్నారు.

ఇక మరోవైపు రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు సమీపించనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయ విశ్లేషకులు సైతం దీనిపై పలు రకాలుగా స్పందించారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ దేశరాజధానికి వెళ్తుడడంతో ఈ వార్తాలు బలంగా మారాయి. దీంతో కేసీఆర్ పర్యటపై ఆసక్తి నెలకొంది. అయితే, ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఎవరిని కలవబోతున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పర్యటనకు సంబంధించిన డిటైల్స్ పై కూడా సమాచారం లేదు. అయితే మరో రెండు, మూడు రోజుల్లో కేసీఆర్ పర్యటనపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవచ్చనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు, బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. కానీ అటు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మాత్రం అలాంటి ఆలోచన లేదని కొట్టిపారేస్తున్నారు.

Updated : 20 Feb 2024 5:11 AM GMT
Tags:    
Next Story
Share it
Top